అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థినితో ప్రిన్సిపాల్ వెకిలిచేష్టలు
Published on Thu, 07/16/2015 - 16:37
చౌటుప్పల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థినితో వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పాఠశాలపై దాడిచేసి, సదరు ప్రిన్సిపాల్కు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ అనే వ్యక్తి చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్గా పని చేస్తున్నాడు.
కాగా అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో గణేష్ వెకిలిగా ప్రవర్తించాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దాంతో వారు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూలు వద్దకు చేరుకుని గణేష్తో వాగ్వాదానికి దిగారు. అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
#
Tags