amp pages | Sakshi

‘ఉన్నతం'గా దోచేస్తున్నారు !

Published on Wed, 03/06/2019 - 10:46

సాక్షి సిటీబ్యూరో: వ్యాపారుల క్రయ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి వారి ద్వారా జరిగే వ్యాపారాలకు ప్రభుత్వం నిర్దేశించిన పన్నును  వసూలు చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులే దానికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ అదాయాన్ని పెంచాల్సిన కొందరు అధికారులు వ్యాపారులతో కుమ్మకై  ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. వాణిజ్య పన్ను చట్టాలను ఆసరాగా తీసుకొని వ్యాపారులకు ముందుగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి అనంతరం సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలోని ఏడు డివిజన్లలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయ లు అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల అక్రమ బాగోతంపై ‘సాక్షి’ ప్ర త్యేక కథనం..

వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పంజగుట్ట డివిజన్, సోమాజిగూడ సర్కిల్‌లోని ఓ ప్రముఖ బంగారు నగల దుకాణానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.23 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. అయితే సదరు వ్యాపారి తన పలుకుబడిని వినియోగించి ఉన్నత అధికారులతో ఒప్పందం చేసుకుని కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించా డు. ఇందుకు గాను ఉన్నతాధికారులకు రూ.కోట్లల్లో ముడుపులు అందినట్లు సమాచారం.
అబిడ్స్‌ డివిజన్, గౌలిగూడ సర్కిల్‌లోని ఓ రెడీమెడ్‌ షోరూంకు సంబంధించి షాప్‌లపై దాడులు నిర్వహించిన శాఖ అధికారులు రూ. 16 కోట్ల పన్ను చెల్లించనందుకుగాను జరిమానా విధించారు. సదరు వ్యాపారి ఉద్యోగుల అండదండలతో సదరు శాఖ ఉన్నతాధికారి సంప్రదించడంతో అతని కేసును పక్కన పెట్టేశారు.
అబిడ్స్‌ డివిజన్, బషీర్‌బాగ్‌ సర్కిల్‌ పరిధిలోని ఓ భవన నిర్మాణ సంస్థకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించిన సర్కిల్‌ అధికారులు రూ. 3 కోట్లు పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ షాకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు సంస్థ యజమాని కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారిని కలిసి సెటిల్‌మెంట్‌ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో కేసు రూ.10 లక్షల్లో సెటిల్‌ కానున్నట్లు తెలిసింది. కేవలం ఈ మూడు డివిజన్లలోనే కాకుండా గ్రేటర్‌పరిధిలోని చార్మినార్, బేగంపేట్, సరూర్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు హైదారాబాద్‌ రూరల్‌ ప్రాంతాల్లోనూ అధికారుల అక్రమాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లల్లో గండి పడుతోంది.

నిబంధనలకు నీళ్లు
ప్రభుత్వ అధికారులు తాము పనిచేస్తున్న శాఖపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోవడం లేదు. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి.  వ్యాపార సంస్థలు, షాప్‌లపై తనిఖీలు నిర్వహించే అధికారులు వ్యాపార లావాదేవీల సమాచారం నిమిత్తం 304 నోటీసులు జారీ చేస్తారు. ఇందులో సేల్స్,  కొనుగోలు బిల్లులు, స్టాక్‌తో పాటు లాభ నష్టాలకు సంబందించిన వివరాలు అందజేయాలని సూచిస్తారు. సదరు వ్యాపారి అకౌంట్స్‌ వివరాలు అందజేయకపోతే మూడుసార్లు 310 నోటీసులు జారీ చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అధికారులు అందుకు విరుద్ధంగా 305 ఏ చట్టం ద్వారా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులను బెదిరిస్తున్నారు. సదరు వ్యాపారిని నేరుగా కార్యాలయానికి పిలిపించుకుని అతడితో బేరం కుదిరాక రూ.కోట్లలో ఉన్న మొత్తాన్ని రూ. లక్షలకు తగ్గించి 305 ఆర్డర్‌ ఇస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉన్నా వారికి అందాల్సిన వాటా అందుతుండటంతో వారు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వైఖరి కారణం గా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. వాణిజ్య పన్నుల శాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నందున అధికారుల అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపార సంఘాల నేతలు కోరుతున్నారు.

అక్రమాలకు పాల్పడితేకఠిన చర్యలు
డివిజన్‌ పరిధిలో సీటీఓల ద్వారా జారీ అయ్యే ప్రతి షోకాజ్‌ నోటీసుకు సంబంధించిన పన్నులు కచ్చితంగా వసూలు చేస్తాం. 304 నోటీసులతో వ్యాపారులు స్పందించకపోతే మూడు సార్లు 310 నోటీసులు ఇస్తున్నాం. అనంతర 305 ఏ నోటీసులు జారీ చేస్తున్నాం. వ్యాపారుల లావాదేవీలకు అనుగుణంగా ప్రభుత్వానికి రావాల్సిన అదాయాన్ని పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నాం. కింది స్థాయి అధికారులు  అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– కె. సీతాలక్ష్మి, జాయింట్‌ కమిషనర్‌ అబిడ్స్‌ డివిజన్‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)