నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
Published on Thu, 05/03/2018 - 08:58
పాపన్నపేట(మెదక్) : పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరెట్లో అధి కారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న నిర్మాణాలను ఈ వేసవి సెలవుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణాలు పూర్తిచేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం తరువాత పనులు కొనసాగకూడదన్నారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
#
Tags