amp pages | Sakshi

‘ముందస్తు’కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు..!

Published on Tue, 08/21/2018 - 01:58

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం దీనికి సిద్ధమవుతోంది. సాధారణ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌–మేలో జరిగినా... అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల తుది జాబితా రూపకల్పన ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈవో) ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ను, ఓటరు రసీదు పరికరాల (వీవీప్యాట్‌)ను సమకూర్చుకుంటోంది. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో కీలకమైన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చివరిదశకు చేరింది.

పోలింగ్‌ శాతాన్ని పెంచేలా వాటి హేతుబద్ధీకరణ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో 32,204 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఈసారి ఓటర్లకు మరింత అనువుగా ఉండేలా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు పాత వాటి స్థలం మార్పు ప్రక్రియ జరుగుతోంది. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ మరో వారంలో ముగియనుంది. జిల్లాలవారీగా ప్రతిపాదనలు సీఈవో కార్యాలయానికి చేరుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 34,300కు చేరనుంది. గత ఎన్నికల కంటే దాదాపు మూడు వేల పోలింగ్‌ కేంద్రాలు పెరగనున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారు. కేవలం అసెంబ్లీకి మాత్రమే అయితే రెండు లక్షల మంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో తొలిసారి వీవీప్యాట్‌లు... 
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి 84,400 ఈవీఎంలను, అంతే సంఖ్యలో ఓటరు రసీదు పరికరాల (వీవీప్యాట్‌)ను సిద్ధం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటరుకు రసీదు ఇచ్చే విధానం రాష్ట్రంలో తొలిసారి అమలులోకి రానుంది. ఓటరుకు రసీదు ఇచ్చేలా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు మొదటిసారిగా ఓటరు రసీదు పరికరాల (వీవీప్యాట్‌)లను అమర్చనున్నారు. వీవీప్యాట్‌లను అమర్చుతున్న నేపథ్యంలో ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 1,400 ఓట్లు మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,300 ఓటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈసీఐ ఆదేశాల ప్రకారం: సీఈవో 
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారం 2019 జనవరి 1 నాటికి ఓటర్ల సవరణ జాబితాను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభకు, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల విషయంలో నిర్ణ యం తీసుకుంటే దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)