తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ మృతులు
Published on Mon, 05/25/2015 - 12:28
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సూర్య 'ప్రతాపం' కొనసాగుతోంది. ప్రఛండ భానుడు నిప్పులు కక్కుతుండడంతో జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బతో పిట్టల్లా రాలుతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో పలువురు వడదెబ్బ కారణంగా మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్:
- ప్రకాశం జిల్లాలో వడదెబ్బకారణంగా ముగ్గురు మృతి చెందారు. నెట్టెంపాడు మండలం నారపల్లిలో వెంకటస్వామి(65) వడ దెబ్బతో మృతి చెందాడు.
- వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులోని బలిజ వీధికి చెందిన మాదా పద్మావతమ్మ (70) నాలుగు రోజులు నుంచి విరేచనాలు, వాంతులు, నీరసంతో బాధపడుతుండగా సోమవారం ఉదయం మృతి చెందింది.
- కర్నూలు: వెల్దుర్తి మండలంలో సోమవారం ఓ వృద్ధుడు వడద్బెకు మృతి చెందాడు. మండలంలోని రామల్లకోట గ్రామంలో వీరశేఖర(68) ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతతో ప్రాణాలొదిలాడు.
తెలంగాణ:
- ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శేర్ల పెద్దయ్య ఆదివారం ఇళ్లకు తడికెలు అల్లే పనికి వెళ్లి ఎండవేడికి అస్వస్థత పాలయ్యాడు. సోమవారం వేకువ జామున మృతి చెందాడు.
- రంగారెడ్డి జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్కు చెందిన స్మిత (18) కూడా వడదెబ్బ కారణంగా సోమవారం ఉదయం మృతి చెందింది.
- మెదక్ జిల్లా సిద్ధిపేల మండలం లక్ష్మీందేవపల్లిలో వడదెబ్బతో ఇద్దురు మృతి చెందారు.
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో వడదెబ్బకు మహిళ మృతి చెందింది.
#
Tags