amp pages | Sakshi

ప్రయాణాలు భద్రం.. తగ్గిన ప్రమాదాలు

Published on Sun, 12/30/2018 - 05:34

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు రోడ్డు రక్షణ సంస్థ (రోడ్‌ సేఫ్టీ అథారిటీ) ఓ అధ్యయనంలో తేల్చింది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రులు, వాహన నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు, జరిమానాలపై అథారిటీ చైర్మన్, డీజీ కృష్ణప్రసాద్‌ తన వార్షిక నివేదికను శనివారం విడుదల చేశారు.  
సమన్వయంతో ముందుకు... 
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్‌సేఫ్టీ అథారిటీ వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్టు కృష్ణప్రసాద్‌ తెలిపారు. రోడ్డు భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, రవాణా శాఖ, పోలీస్‌ శాఖ, వైద్య,విద్యాశాఖ ఇతర విభాగాలతో కలసి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం, అదే విధంగా ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టడం, రోడ్డునిర్మాణాల్లో ప్రమాదాల నివారణకు తగ్గట్టు నిర్మించేలా సూచనలు చేస్తూ పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదాలు జిల్లాల రోడ్లలోనే 55శాతం జరుగుతున్నాయని, రాష్ట్ర రహదారులపైన 16శాతం, జాతీయ రహదారులపైన 29శాతం మేర ప్రమాదాలు జరుగుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో 31శాతం మేర ప్రాణనష్టం ఉండగా, రాష్ట్ర రహదారులపై 18శాతం, జిల్లా స్థాయి రోడ్ల మీద 51శాతం ప్రాణనష్టం జరుగుతోందని వెల్లడైనట్టు పేర్కొన్నారు.  

బ్లాక్‌ స్పాట్స్‌పై నజర్‌... 
రాష్ట్రంలోనుంచి ప్రయాణిస్తున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లాల్లోని ప్రధాన రహదారులపై పదే పదే జరుగుతున్న ప్రమాద ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్స్‌గా గుర్తించినట్టు రోడ్డు రక్షణ సంస్థ చైర్మన్‌ డీజీ కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. 5 ప్రమాదాలకు మించి , 500 మీటర్ల లోపు జరిగిన ప్రమాద స్థలాన్ని బ్లాక్‌ స్పాట్స్‌గా పరిగణించినట్టు తెలిపారు. అదే విధంగా బ్లాక్‌ స్పాట్‌ను మూడు విధాలుగా గుర్తించామని, అందులో ఏ, బీ, సీ గ్రూపులుగా చేసి ప్రమాదాల నియంత్రణకు 2016నుంచి ఇప్పటివరకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 20ప్రమాదాలు లేదా 20మంది ఒకే ప్రమాదంలో మరణిస్తే ఏ కేటగిరి, 10ప్రమాదాలు లేదా ఒకే ప్రమాదంలో 10మంది మృతిచెందితే బి కేటగిరి, 5ప్రమాదాలు, ఐదుగురు మృతిచెందిన ప్రమాద ప్రాంతాన్ని సీ కేటగిరిగా విభజించారు. దశల వారీగా బ్లాక్‌ స్పాట్స్‌ను క్లియర్‌ చేసేందుకు అవగాహన, ముందస్తు జాగ్రత్తలు, ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగుకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్‌ ఇంజనీరింగ్‌లోమార్పులు, ప్రమాద స్థలాలకు చేరువలో అంబులెన్స్, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్లాక్‌ స్పాట్స్‌ వల్ల 2016లో 446 ప్రమాదాలు జరుగగా 573 మంది మృతిచెందగా, 818మంది క్షతగాత్రులయినట్టు నివేదికలో స్పష్టంచేశారు. 2017లో 292 ప్రమాదాలు జరిగితే 357మంది మృతిచెంది, 517 మంది క్షతగాత్రులయ్యారు. అలానే 2018లో 154 ప్రమాదాలు జరుగగా 216మంది ప్రాణాలు కోల్పో యి, 301మంది క్షతగాత్రులైనట్టు వెల్లడించారు.  

‘కొండ గట్టు’తో జాగ్రత్తలు.. 
కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై వెంటనే రోడ్‌ సేఫ్టీ అథారిటీ స్పందించి, భవిష్యత్‌లో అలాంటి ప్రమాదాలు ఘాట్‌రోడ్డులో జరగకుండా చర్యలు చేపట్టినట్టు కృష్ణప్రసాద్‌ స్పష్టంచేశారు. ఘాట్‌ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశామని, బారికేడ్లు, బూమ్‌ బారియర్స్‌ ఏర్పాటుచేశామన్నారు. తాత్కాలికంగా ఏఎస్‌ఐ, ఏఎంవీఐ,ఏఈఈలతో రోడ్‌ సేఫ్టీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ఘాట్‌ రోడ్డుపై పూర్తి స్థాయిలో హెచ్చరిక బోర్డు, సిమెంట్‌ కట్టడాలతో రైలింగ్స్, రాత్రి వేళల్లో లైటింగ్, రేడియం స్టిక్కర్లు తదితరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)