amp pages | Sakshi

5 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Published on Sat, 10/25/2014 - 01:42

  • దాదాపు నెల రోజుల పాటు అసెంబ్లీ
  •   వెయ్యి ఎకరాల్లో పాలీ హౌజ్‌ల కోసం 252 కోట్లు
  •   విజయా డైరీ పాల సేకరణలో లీటరుకు రూ. 4 ప్రోత్సాహం.. 
  •  నెల రోజుల పాటు అసెంబ్లీ  తెలంగాణ రాష్ర్ట కేబినెట్ భేటీలో నిర్ణయం
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట తొలి బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు. శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పూర్తిస్థాయిలో దాదాపు నెల పాటు నిర్వహిస్తామని, ఈ సమాచారాన్ని గవర్నర్‌కు పంపిస్తున్నామని కేసీఆర్ వివరించారు. రాష్ర్టంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 
     
    ‘‘డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ దళితులు/గిరిజనులకు వంద శాతం సబ్సిడీతో... చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, మిగిలిన రైతులకు 80 శాతం సబ్సిడీతో పరికరాలు అందించనున్నాం. తొలి విడతలో హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి ఎకరాల్లో పాలీహౌజ్ సేద్యాన్ని ప్రోత్సహిస్తాం. ఇందుకు రూ. 252 కోట్లు మంజూరు చేశాం. ప్రతి రైతుకూ వెయ్యి మీటర్ల నుంచి మూడు ఎకరాల వరకు ఈ సేద్యం చేయడానికి అనుమతిస్తాం. అందులో 75 శాతం మేరకు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 200 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఈ పరికరాలను 50 శాతం సబ్సిడీతో ఇస్తాం. విజయా డెయిరీకి పాలు విక్రయించే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నాం’’ అన్నారు.
     
     రేషన్‌కార్డులపై మరోసారి అధ్యయనం...
     రేషన్‌కార్డుల జారీ, బియ్యం కోటా పెంపు, పెన్షన్ల జారీ అంశాలపై మరోసారి అధ్యయనం చేసి, వీలైనంత త్వరగా అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూములు మూడేళ్లలో వినియోగించుకోని పక్షంలో.. తిరిగి వాటిని తీసుకోవడంతోపాటు ఏ విధంగా వినియోగించుకోవాలన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. భూదానబోర్డు భూములను పూర్తిస్థాయిలో సర్వే చేయాలని నిర్ణయింది. బోర్డు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలతో నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్పులు చేసి మరింత కఠినతరం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వ భూముల కబ్జాతో వివిధ సమస్యలు వస్తున్నందున కబ్జాదారులపై వెంటనే 420 ఐసీపీ కింద కేసులు నమోదు చేయాలని అభిప్రాయపడింది. అలాగే చంద్రబాబుపై ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు ఎక్కడికక్కడ దాడి ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని సమాచారం. 

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)