amp pages | Sakshi

ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం : హైకోర్టు

Published on Mon, 07/20/2020 - 15:52

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనాపై హెల్త్‌ బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28న సీఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కోర్టులో హాజరు కావాలని తెలిపింది. తెలంగాణ వ్యైద ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ను పునరుద్దరించాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది.

జిల్లాల వారీగా కరోనా కేసులను కలెక్టర్లు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలను, ర్యాపిడ్‌ టెస్ట్‌ సెంటర్ల వివరాలను వెల్లడించాలని సూచించింది. పెళ్లిళ్లు అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలని ఆదేశాలు జారీచేసింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపింది. 

అంతకుముందు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.  కోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. అధికారులపై కేసు పెట్టి సస్పెండ్‌‌ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని అడిగింది. పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్క తీర్పు కూడా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. (నిమ్స్‌లో వాలంటీర్‌కు తొలి డోస్‌ ఇచ్చిన వైద్యులు)

అలాగే కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం వెనకబడి ఉందని తెలిపింది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా అని మండిపడింది. కరోనాపై విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్‌లలో సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని చెప్పింది. ఆస్పత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకోవడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొంది.(హీరోయిన్‌ ఐశ్వర్య అర్జున్‌కు కరోనా)

మరోవైపు కరోనాపై విడుదల చేసిన బులెటిన్‌లో హైకోర్టు అభినందించిందని ఇవ్వడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మెట్టికాయలు వేస్తుంటే అభినందించినట్టు ఎలా చెప్తారని ప్రశ్నించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)