amp pages | Sakshi

చెత్త గురించీ చెప్పలేరా? 

Published on Sun, 03/08/2020 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: చెత్త తొలగింపునకు తీసుకున్న చర్యలు గురించి వివరిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో అరకొర సమాచారం ఉందని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ దుర్గంధంగా మారి పరిసర ప్రాంతాలకు దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని నగరానికి చెందిన సీతారామరాజు లేఖ ద్వారా హైకోర్టు దృ ష్టికి తెచ్చారు. దీనిని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణిం చి హైకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది. జ వహర్‌నగర్‌ నుంచి డంపింగ్‌ యార్డ్‌ తరలింపునకు మూడు ప్రత్యామ్నాయ స్థలాలను..గు ర్తించినా కదలిక లేదని వ్యాఖ్యానించింది.

‘పటాన్‌చెరు మండ లం లక్దారంలో 150 ఎకరాలను జీహెచ్‌ఎంసీ గుర్తిస్తే ఆ భూమిని రాజీవ్‌ గృహకల్పకు కేటాయించినట్లుగా కలెక్టర్‌ లేఖ రాశారు. గుమ్మడిదల మండల ప్యానానగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన 152 ఎకరాల భూమి ఉంది. అయితే రోడ్డు నిర్మాణం కోసం 2.12 ఎకరాల్ని కేటాయించాలని గత ఏడాది సెప్టెంబర్‌లో అటవీశాఖకు లేఖ రాస్తే ఇప్పటి వరకు అనుమ తి రాలేదు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలను జీహెచ్‌ఎంసీ గుర్తించినా దానిని స్వాధీనం చేసుకోలేదు’ అని కమిషనర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారంటే ప్రత్యామ్నాయ స్థలాల్లో పనులేమీ మొదలు కాలేదని స్పష్టం అవుతోందని ధర్మాసనం పే ర్కొంది. హైకోర్టులో పిల్‌ దాఖలైన తర్వాత గత 8 నెలలుగా సమావేశం కాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

చెత్తను తొలగించేందుకు 2,500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను మంజూరు చేసినట్లు చెప్పారేగానీ వాటిని ఎ క్కడ వినియోగిస్తున్నారో, ఫలితాలెలా ఉన్నాయో చె ప్పలేదని తప్పుపట్టింది. తడి, పొడి చెత్తలకు విడివిడి గా డబ్బాలను ఏర్పాటు ఫలితాల గురించిగానీ, వాణిజ్య ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా చెత్త డబ్బాలను వినియోగించని వారు, వారికి విధించిన జ రిమానాల గురించి సమాచారం అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) నెలకు రెండుసార్లు జీహెచ్‌ఎంసీకి ఇచ్చే నివేదికలను అఫిడవిట్‌తో జత చేశా రని, అవి అర్ధమయ్యేలా లేవని పేర్కొంది. విచారణ ను ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)