amp pages | Sakshi

1.87 లక్షల కేసులతో ప్రారంభం

Published on Thu, 01/03/2019 - 02:21

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా కొలువు దీరిన తెలంగాణ హైకోర్టు బుధవారం తొలిరోజు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేసుల విచారణకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులందరూ (ఫుల్‌కోర్టు) మొదటి కోర్టు హాలులో సమావేశమయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి, న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కావడం తనకు దక్కిన గౌరవం అని సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 1.87 లక్షల కేసులతో తెలంగాణ హైకోర్టు తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోందని వెల్లడించారు. అనేక చారిత్రక ఘట్టాలకు ఈ న్యా యస్థానం వేదికగా నిలిచిందన్నారు. న్యాయ వాదులు, న్యాయమూర్తులుగా అత్యుత్తమ స్థాయిలో విధులు నిర్వర్తించేందుకు బద్ధులుగా ఉంటామని మనకు మనం ప్రతిజ్ఞ చేసుకోవాలని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయవాదుల సంఘాలు, అడ్వొకేట్‌లు జనరల్, ప్రభుత్వ అపరిమిత మద్దతు వల్ల, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది కృషి వల్ల ఉమ్మడి హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా రూపాంతరం చెందిందన్నా రు. సకాలంలో న్యాయా న్ని అందించే దిశగా క్రమశిక్షణ, సమతుల్యతను అలవరుచుకో వాలని న్యాయమూర్తులకు సూచించారు. 

బార్, బెంచ్‌ కలిస్తేనే.. 
న్యాయవాదులు(బార్‌), న్యాయమూర్తులు (బెంచ్‌) కలసి పరిమాణాత్మక, గుణాత్మక దిశ గా పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని సీజే ఆశాభావం వ్యక్తం చేశారు. బార్, బెంచ్‌ నాణేనికి రెండు ముఖాలు మాత్రమే కాదని, న్యాయరథానికి రెండు చక్రాలు కూడా అని అన్నారు. ఇవి న్యాయప్రతిష్టను ముందుకు తీసుకెళ్తాయన్నారు. తెలంగాణలో అత్యున్నత న్యాయస్థానం ఉన్న ఈ కేంద్రం నుంచి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతూ, ప్రజలకు సేవ చేసేందుకు కలసి నడుద్దామని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ చారిత్రకఘట్టాలకు సాక్షులుగా నిలవడం గౌరవంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట, విలువను కాపాడేందుకు న్యాయవాదులంతా కృషి చేస్తామన్నారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి, న్యాయవ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు బార్‌కౌన్సిల్‌ కట్టుబడి ఉందన్నారు. న్యా యవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జడ్జీల ఖాళీలను భర్తీచేయాలని, అప్పుడే సత్వర న్యాయం సాధ్యమవుతుందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమం అనంతరం కేసుల విచారణ ప్రారంభమైంది.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)