amp pages | Sakshi

ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?

Published on Fri, 05/22/2020 - 02:52

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ధరల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు దోపిడీకి గురికాకూడదని, ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదని వ్యాఖ్యానించింది. ధరల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవంది. ధరల్ని అదుపు చేసే విషయాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లుగా ఉందని చెప్పడానికి.. జంట నగరాల్లో 290 కేసులు మాత్రమే నమోదు చేసినట్లుగా ప్రభుత్వ నివేదిక నిదర్శనమని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలను అదుపు చేయాలని ఆదేశించింది. ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఈ నెల 26 నాటికి సమర్పించాలని, తదుపరి విచారణను ఈ నెల 27న జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాç Üనం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసరాల ధరలు పెరిగాయని పత్రికల  వార్తా కథనాన్ని పిల్‌గా పరిగణించి గురువారం మరోసారి విచారణ జరిపింది.

కిలో కందిపప్పు రూ.200 ఎందుకుంది? 
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అధిక ధరలకు విక్రయాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జంటనగరాల్లో అధిక ధరలకు విక్రయించే వారిపై 290 కేసులు నమోదు చేశారని తెలిపారు.  దీనికి ధర్మాసనం స్పందిస్తూ..ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌