ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ ఉత్సవంగా పీవీ జయంతి
Published on Tue, 06/24/2014 - 20:16
హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 28న తెలంగాణ వ్యాప్తంగా పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
అదే రోజు హన్మకొండలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు టీఆర్ఎస్ నాయకుడు కెప్టన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఏకశిల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కాగా, పీవీ నరసింహారావు జయంతి ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
#
Tags