టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలి'
Published on Fri, 05/22/2015 - 13:22
హైదరాబాద్: అసెంబ్లీ కార్యదర్శి అధికార పార్టీ టీఆర్ఎస్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో టీటీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేల జాబితాలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ఎలా చేరుస్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెన్నమనేని రమేష్కు ఓటు హక్కులేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ గురువారమే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రిటర్నింగ్ అధికారికి డైరెక్షన్స్ ఇవ్వాలంటూ ఈసీని కోరినట్లు తెలంగాణ టీడీపీ నేతలు వెల్లడించారు.
#
Tags