amp pages | Sakshi

మోదీ పాలనతోనే దేశం సుభిక్షం 

Published on Wed, 04/03/2019 - 10:34

సాక్షి, కొత్తకోట : నరేంద్ర మోదీ పాలనతోనే దేశం సుభిక్షంగా ఉందని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తనను ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపాలని కోరారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఆ పార్టీ నాయకులు డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ఎగ్గని నర్సింహులు ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమానికి డీకే అరుణ, పార్లమెంట్‌ సభ్యులు జితేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు శాంతికుమార్, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సహం నిండింది. బాణ సంచా కాల్చుతూ, డప్పులతో ఊరేగింపుగా భారీ ఎత్తున రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు ఎద్దుల రాజవర్దన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ మాట్లాడారు. 

ప్రజలు మోదీని కోరుకుంటున్నారు.. 
దేశంకోసం, దేశ ప్రజలకోసం, దేశ సమగ్రతకోసం మళ్లీ ప్రదానిగా నరేంద్రమోదీనే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. భారతదేశ ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్న నరేంద్రమోదీ గ్రామాల్లోని మహిళలు, వృద్దులు, నిరుద్యోగులు మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, రాష్ట్ర ప్రజలు  కేసీఆర్‌ను మొన్ననే  ముఖ్యమంత్రిని చేశారని, ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నేటికి అమలు కాలేదన్నారు.

16సీట్లతో కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో ఏమి చేస్తాడని ఆమె ప్రశ్నించారు. మరోసారి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని, ఆయన మాటలు నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆభ్యర్థులకు ఈ నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేదన్నారు.  

ఆశీర్వదించి లోక్‌సభకు పంపండి.. 
గత 25సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటా వాటి పరిష్కారనికి కృషి చేస్తున్నాని, ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల మధ్యనే ఉన్నానన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో తనను మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలిపించి లోక్‌సభకు పంపిస్తే పాలమూరులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించడం కొరకు తనవంతు కృషి చేస్తానన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని నేటికి పూర్తి చేయలేకపోయారన్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని ఈ సందర్భంగా ఆమె  విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే పాలమూరు ప్రాంతంపై వివక్షత చూపుతున్నారన్నారు. బీజేపీని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌.వెంకట్‌రెడ్డి, సాయిరాం, మాధవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మన్నెంయాదవ్, రాజేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, దాబ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 

 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)