amp pages | Sakshi

రాష్ట్రంలో ఓటర్లు.. 2,61,36,776

Published on Tue, 09/11/2018 - 02:44

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 2,61,36,776 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,32,67,626 మంది పురుషులు, 1,28,66,712 మంది మహిళలు, 2,438 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్య మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మేరకు 2018కి సంబంధించిన రెండో ఓటర్ల జాబితా సవరణ ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సోమవారం ప్రకటించింది. 2018, జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా తొలి సవరణ ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,53,27,785 కాగా, అనంతర కాలంలో 9,45,955 మంది కొత్త ఓటర్లకు చోటు కల్పించడంతో పాటు వివిధ కారణాలతో 1,36,964 మంది ఓటర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,61,36,776 మందికి చేరుకుంది.

రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఈసీ ప్రత్యేకంగా రెండో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ ప్రకారం.. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణతో పాటు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 10 నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తారు. వచ్చే నెల 4లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 8న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  

కొత్త యువ ఓటర్లు 2 లక్షలు...
తాజాగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య వయసున్న 2,20,674 మంది కొత్త యువ ఓటర్లు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,34,329 మంది పురుషులు, 86,313 మంది మహిళలు, 32 మంది ఇతరులున్నారు. 19 ఏళ్లకు పైబడిన మొత్తం ఓటర్లు 2,59,16,102 మంది.. కాగా అందులో 1,31,33,397 మంది పురుషులు, 1,27,80,399 మంది మహిళలు, 2,406 మంది ఇతరులున్నారు.  

హైదరాబాద్‌ టాప్‌.. వనపర్తి లాస్ట్‌
రాష్ట్రంలో అత్యధికంగా 38,61,009 మంది ఓటర్లు హైదరాబాద్‌ జిల్లాలో ఉండగా, అ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 26,56,013 మంది, మేడ్చెల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 19,87,270 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 12,23,554 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,09,340 మంది ఓటర్లు ఉండగా, ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో 3,52,666 మంది, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3,55,907 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,66,701 మంది ఓటర్లున్నారు.  


 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)