వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కలెక్టర్ అమ్రపాలి సాహసం..
Published on Sun, 09/03/2017 - 18:24
సాక్షి, వరంగల్: ఇటీవల కాలంలో తన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మరోసారి తన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండువుల గుట్టలలో నిర్వహిస్తున్న రాక్ క్లైంబింగ్ ఫెస్టీవల్లో రెండో రోజు ఆమె పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె సేఫ్టీ హెల్మెట్ ధరించి కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ ధైర్య సాహసాలు ప్రదర్శించారు.
ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక మహిళలు అక్కడికి చేరుకొని కలెక్టర్ సాహసాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మెచ్చుకున్నారు. గతంలో మరో కలెక్టర్తో కలిసి అడవిలో దాదాపు 15 కిలో మీటర్లు నడిచి కలెక్టర్ అమ్రపాలి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టీవల్ను శనివారం స్పీకర్ మధుసూధనాచారి ప్రారంభించగా ఫెస్టీవల్లో పాల్గొన్న విద్యార్థులు హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన శేఖర్ బాబు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ఈ ఫెస్టీవల్కు వరంగల్ అర్బన్ జిల్లా అటవీశాఖ అధికారి అర్పణ, జయశంకర్ భూపాలపెల్లి జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags