amp pages | Sakshi

ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదా... హామీ ఏమైంది..?

Published on Wed, 11/26/2014 - 03:23

దమ్మపేట: ‘‘ఎస్సైలకు గెజిటెడ్ హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? దాని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా..?’’ అని, వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష నేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం అసెంబ్లీ జీరో ఆవర్‌లో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనితోపాటు, పోలీసు సిబ్బందికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన 20 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ వివరాలను ఆయన ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు.


 ‘‘టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఐ)లకు గెజిటెడ్ హోదా కల్పిస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. దీని అమలును ప్రభుత్వం మరిచిపోరుుందా...? ఎస్‌ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు బయట విధులకు వెళితే టీఏ, డీఏ ఇవ్వాలి. కానీ అరకొరగా మాత్రమే ఇస్తున్నారు. పాత నిబంధనల ప్రకారంగా ఎస్‌ఐకు రెండువేలు, కానిస్టేబుళ్లకు 1050 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎలా సరిపోతారుు..? పోలీస్ సిబ్బంది యూనిఫాం కోసం ప్రభుత్వం ఏడాదికి రెండువేలు కేటాయిస్తోంది.

 ప్రస్తుత మార్కెట్‌లో దుస్తుల ధరలు ఆకాశాన్నంటున్నారుు. ఈ పరిస్థితిలో ఈ మొత్తం ఏ మేరకు సరిపోతుందో ప్రభుత్వమే ఆలోచించాలి. తక్కువ జీతాలతో పోలీసుల జీవనం కష్టంగా మారుతోంది. పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ప్రభుత్వం అరకొరగా వేతనాలు ఇస్తోంది. వారి జీవనం ఎలా సాగుతుంది? హోంగార్డులకు వేతనంగా నెలకు 15వేల రూపాయలు ఇవ్వాలి’’ అని కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు.

 ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు
 ప్రోత్సాహమమివ్వాలి
 ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమమివ్వాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ విధంగా ఇస్తారో స్పష్టం చేయాలి’’ అని ఆయన కోరారు.  మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్నగా దీనిని తాటి వెంకటేశ్వర్లు లేవనెత్తారు. ‘‘ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలి, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి.

ఇది ప్రభుత్వానికి సాధ్యమా..?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు భూములుండవు. భూములు లేని వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ పరిస్థితిలో ఆయా వర్గాల పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహాన్నిస్తుందో సభలో చెప్పాలి’’ అని కోరారు. ‘‘ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. ప్రభుత్వ భూములను కేటాయించాలి. మార్జిన్ మనీ కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరిజన, దళిత పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహం అందిన విషయూన్ని గుర్తు చేశారు. అదే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్