amp pages | Sakshi

డబుల్ ఇళ్ల ఊసెక్కడ..?

Published on Wed, 04/20/2016 - 02:49

శంకుస్థాపనకే పరిమితమా!?
కొణిజర్ల : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం డబుల్ బెడ్ రూం పథకం ఇంత వరకు మొదలు కాలేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని గల్లీ నాయకుడి దగ్గర నుంచి మంత్రి వరకు అందరూ హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపి వేసింది. అటు పాత బిల్లులు రాక కొత్త ఇళ్లు రాక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
 
వైరా నియోజకవర్గ పరిధిలో 400 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలను మొదలు పెట్టేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఏడాది అక్టోబర్ 26న తనికెళ్లలో శంకుస్థాపన చేశారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మండలంలో తనికెళ్ల, పెద్దగోపతి, తీగలబంజర, రాంపురం, విక్రంనగర్ గ్రామాల్లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ స్వయంగా లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు సైతం ప్రకటించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జాబితాకు బ్రేక్ పడింది.

జిల్లా కలెక్టర్, మంత్రి , ఎమ్మెల్యేలు కలసి జాబితాను తయారు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు తిరిగి దాని ఊసే ఎవ్వరు ఎత్తటం లేదు. అధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
 
ఉన్న ఇళ్లు కూల్చారు..
ఎమ్మెల్యే ప్రతిపాదనతో ఇక తమకు ఇళ్లు ఖాయం అన్న ధీమాతో పలువురు లబ్ధిదారులు తమకున్న కొద్ది పాటి ఇండ్లను కూల్చివేసుకున్నారు. తనికెళ్లలో సుమారు 8 మంది, తీగలబంజరలో రెండు కుటుంబాల వారు తమకున్న ఆధారాలను కూల్చివేసుకుని రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలకు ఆ రేకుల షెడ్లలో ఉండలేక అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల నిరుపేదల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.  

ఇప్పట్లో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి కనబడటం లేదు. గ్రామంలో ఉమ్మడిగా స్థలం ఉన్నచోట ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే ఇలా మండలంలో ఎక్కడా ప్రభుత్వ స్థలం లేదు. దీంతో సొంతింటి కల నెరవేరుతుందా.. లేదా.. అనే అయోమయంలో లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార్లు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)