amp pages | Sakshi

తుర్కపల్లిలో మహిళ హత్య..!

Published on Thu, 05/29/2014 - 23:21

శామీర్‌పేట్, న్యూస్‌లైన్:  మండల పరిధిలోని తుర్కపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురువారం జరిగింది. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, శామీర్‌పేట్ పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజమాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన సూరి నర్సమ్మ(43), రాజయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నర్సమ్మ భర్త మృతిచెందాడు. ఈక్రమంలో ఆమె బతుకుదెరువు కోసం పిల్లలను తీసుకొని శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లికి వలస వచ్చింది.

 ఓ అద్దె ఇంట్లో ఉంటూ సీజన్‌పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. మూడేళ్ల క్రితం తుర్కపల్లికి చెందిన జీడిపల్లి గురుస్వామితో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం గురుస్వామి ఇంట్లో తెలిసింది. పలుమార్లు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో బుధవారం రాత్రి నర్సమ్మ, గురుస్వామి తుర్కపల్లి శివారులోని ఓ దాబా వెనక ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న గురుస్వామి భార్య తులసమ్మ, కుమారుడు శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. తులసమ్మ, శ్రీకాంత్ నర్సమ్మను తీవ్రంగా చితకబాదారు.

అనంతరం అర్ధరాత్రి సమయంలో వారు నర్సమ్మను ఓ ఆటోలో తీసుకొచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలేసి వెళ్లారు. నర్సమ్మ కుమారుడు రాజశేఖర్ గమనించి తల్లిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. కొద్దిసేపటికే నర్సమ్మ మృతిచెందింది. శామీర్‌పేట్ పోలీసులు, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు గురుస్వామి, ఆయన భార్య తులసమ్మతో పాటు కుమారుడు శ్రీకాంత్‌లను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)