amp pages | Sakshi

యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ

Published on Thu, 06/09/2016 - 01:49

  • వినూత్న పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టాలి: వీకే సారస్వత్
  • రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం
  •  

     సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా దేశవ్యాప్తంగా యువతకు వినూత్న పద్ధతిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ పేర్కొన్నారు. దేశ జనాభాలో పనిచేసే వయసున్న వారి నుంచి ప్రయోజనాలు గత 30 ఏళ్ల నుంచి పొందలేదని... వచ్చే 3 దశాబ్దాల వరకే నైపుణ్యం, పనిచేసే వయసుగల వారి ద్వారా ప్రయోజనం పొందగలమని చెప్పారు. ఈ దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి అంశంపై ముఖ్యమంత్రుల ఉప సంఘం ఇప్పటికే నివేదిక సమర్పించిందని తెలిపారు. బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం జరిగింది.

    ఇందులో వీకే సారస్వత్‌తోపాటు ప్రభుత్వ సలహాదారులు పాపారావు, డాక్టర్ జీఆర్ రెడ్డి, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీతి ఆయోగ్ సలహాదారులు సునీత సంఘీ, ఏకే జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్, విద్య, కార్మిక, మున్సిపల్, సంక్షేమ శాఖలు, న్యాక్, టాస్క్ ద్వారా యువతలో నైపుణ్య అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను నీతి ఆయోగ్ సభ్యులకు రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సారస్వత్ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న ఐటీఐలను పునర్‌వ్యవస్థీకరించాలని, నైపుణ్యం గల సిబ్బందిని నియమించాలని, మంచి సౌకర్యాలను ఏర్పరచాలని చెప్పారు. శిక్షణ పొందే ప్రతి ఒక్కరికి సాఫ్ట్ స్కిల్స్‌లోనూ నైపుణ్యం ఉండాలన్నారు.

     వృత్తిపర గౌరవం పొందాలి..
    వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం తదితర రంగాల్లో శిక్షణ పొంది పనిచేసే వారు వృత్తిపర గౌరవం పొందేలా ప్రభుత్వం చూడాలని సారస్వత్ పేర్కొన్నారు. శిక్షణకు ప్రస్తుత సాంకేతికత కూడా తోడవ్వాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు మరింత సమర్థవంతంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)