రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం
Published on Fri, 09/27/2013 - 09:03
ముంబయి : ముంబయిలో మరో భవనం కుప్పకూలింది. డాక్యార్డ్ రోడ్డు సమీపంలోని పురాతన అయిదు అంతస్తులు భవనం ఈరోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదిహేనుమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 15 బృందాలతో సహాయక సిబ్బంది జెసిబీల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
ముంబయిలో బహుళ అంతస్తుల భవనాలు కూలిన ఘటనలు ఈ ఏడాదిలో ఇది మూడవది. ఏప్రిల్ 4న ఏడంతస్తుల భవనం కూలి 76మంది, జూన్ 10న అయిదంతస్తుల భవనం కూలి మరో 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
#
Tags