amp pages | Sakshi

అక్టోబర్ 12న లండన్ లో సమైక్యవాదుల ధర్నా!

Published on Wed, 10/09/2013 - 12:06

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే విభాగం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 70 రోజులకు పైగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సమైక్యంగా కష్టించి.. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు లభించేలా చేశారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఆదాయంలో 80 శాతానికి పైగా ఆదాయం రాష్ట్ర రాజధాని వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకోకుండా తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని పీఠం ఎక్కించడానికి సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధపడటంతో సీమాంధ్రలోని అనేక ప్రాంతాల్లో చేపట్టిన సమ్మె కారణంగా పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయనే ఆవేదన ఎన్నారైల్లో కూడా వ్యక్తమవుతోంది. 
 
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లండన్ లోని భారతీయ హై కమీషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యాక్రమాన్ని నిర్వహించేందుకు లండన్ మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నామని శ్రీకాంత్ లింగాల, వైఎల్ఎన్ రెడ్డి, రాజుల ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 12 తేది శనివారం 1.30 నిమిషాల నుంచి 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున యూకే, యూరప్ లోని సమైక్యవాదులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం 07540 222344, 07885971115, 07429 300528 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. 
 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?