టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈ దేశీయ విమానంలో ఫ్రీ వై-ఫై
Published on Tue, 03/21/2017 - 09:09
న్యూఢిల్లీ : గగనతలంలో విమానం ఎగురుతున్నట్టు ఫోన్ ఆన్ చేయడమే నిబంధనలకు విరుద్ధం. ఈ నిబంధనలన్నింటిన్నీ మార్చేస్తూ విమానాల్లో వై-ఫై వాడుకునే సౌకర్యాలను పౌర విమానయాన సంస్థలు కల్పిస్తున్నాయి. ఇన్నిరోజులు అంతర్జాతీయ విమానాల్లోనే ఈ సదుపాయం ఉండేది. తాజాగా దేశీయ విమానాల్లోనూ వై-ఫై సందుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ ఇండియా ఆన్ బోర్డులో ఈ జూలై లోపల ఉచిత వై-ఫై సేవలిందించేందుకు ప్లాన్ చేస్తోంది. తన ఎయిర్ బస్ ఏ-320 విమానాలకు ఈ సదుపాయం తీసుకొస్తుందట. ఒక్కసారి ఈ ఎయిర్ బస్ లో ఉచిత వై-ఫైను విజయవంతంగా అందిస్తే, ఇదే బాటలో ఇతర ఎయిర్ లైన్ సంస్థలు పయనించనున్నాయి.
''మా విమానాల్లో వై-ఫై అందించేందుకు కృషిచేస్తున్నాం. వై-ఫై పరికరాలను అమర్చడానికి ఎయిర్ క్రాఫ్ట్ తయారీదారి దగ్గర్నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి వై-ఫై సేవలను అందించగలమో సరియైన తేది చెప్పలేకపోతున్నాం. కానీ జూన్, జూలై మధ్యలో ఈ సేవలను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం'' అని ఎయిర్ ఇండియా చీఫ్ అశ్వని లోహాని చెప్పారు. అయితే ఎంత డేటా అందిస్తోందో, స్పీడు ఎలా ఉంటుందో ఈ విమానయాన సంస్థ ప్రకటించలేదు. తొలుత బేసిక ప్యాక్ లను ఉచితంగా అందించిన తర్వాత, చెల్లింపు ప్యాక్లను ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఉచిత బేసిక్ ప్యాక్, వాట్సాప్ మెసేజ్ లు పంపడం వంటివి చేసుకోవచ్చు. దీంతో ఉచిత వై-ఫై సేవలందించే తొలి ఎయిర్ లైన్ గా ఎయిర్ ఇండియా గుర్తింపు పొందనుంది.
#
Tags