amp pages | Sakshi

భారత్లో అత్యధికంగా కాలుష్య మరణాలు

Published on Fri, 09/09/2016 - 12:44

న్యూఢిల్లీ : గాలి కాలుష్యంతో అత్యధిక మరణాలు సంభవించే రెండో దేశం భారతేనట. చైనా తర్వాత ఈ మరణాలు ఎక్కువగా భారత్లోనే సంభవిస్తున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా రిపోర్టులో వెల్లడైంది. 2013లో భారత్లో గాలి కాలుష్యంతో 1.4 మిలియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని రిపోర్టు తెలిపింది. చైనాలో 1.6 మిలియన్ మంది ప్రజలు చనిపోయినట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలతో 5 మిలియన్ మందికి పైగా చనిపోతున్నారని రిపోర్టు వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఈ రిపోర్టు రూపొందించింది. 
 
గాలి కాలుష్య కారణంతో సంభవించే అకాల మరణాల వల్ల గ్లోబల్ ఎకానమీ వార్షికంగా 5.1 ట్రిలియన్ డాలర్ల వ్యయాలు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేసింది. దేశాల ఎకానమిక్ డెవలప్మెంట్కు ఈ మరణాలు తీవ్ర షాకిస్తున్నాయని, ముఖ్యంగా ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2013లో చైనా తన జీడీపీలో 10 శాతం, ఇండియా 7 శాతం, శ్రీలంక 8 శాతం కోల్పోయినట్టు తెలిపింది. అబివృద్ధి చెందుతున్న దేశాల్లో గాలి కాలుష్యంతో ఆరోగ్య సమస్యల ఎక్కువగా ప్రబలుతున్నాయని రిపోర్టు వివరించింది. 90 శాతం జనాభాకు గాలి కాలుష్య ముప్పు డేంజరస్ లెవల్స్లో ఉన్నాయని హెచ్చరించింది. గాలికాలుష్యంతో గుండె నొప్పులు, గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా లాంటి దీర్ఘకాల శ్వాస సంబంధమైన సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.   

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?