amp pages | Sakshi

అమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూత

Published on Thu, 08/18/2016 - 12:47

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ, భారత్లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతో పాటు, తమ ఈవెంట్లను పోస్ట్పోను చేస్తున్నట్టు వెల్లడించింది. స్వచ్ఛంద నిరసనకారులు తమపై దేశ ద్రోహ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు అమ్నెస్టీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో అమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రోత్సహించారనే ఆరోపిస్తూ.. కొందరు రాజకీయ కార్యకర్తలు ఈ సంస్థ హక్కులపై వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం ప్రదర్శనలు కూడా చేపట్టారు.

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు మేరకు, అమ్నెస్టీ ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో దేశ ద్రోహ నినాదాలు జరిగాయా..అనే దానిపై విచారణ చేపట్టామని పోలీసులు చెప్పారు. అయితే తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, బెంగళూరు సెమినార్కు హాజరైన కొంతమంది ప్రజలు కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని మాత్రమే కోరుకుంటూ నినాదాలు చేశారని ఆ సంస్థ తెలిపింది. అమ్నెస్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రాతిపదికన లేకుండా కేసును నమోదుచేశారని చారిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ కార్యక్రమం అందరినీ ఆహ్వనించదగినదని, ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. కానీ సంస్థకు చెందిన ఎవరు దీనిలో పాల్గొనలేదని వివరించారు. జమ్ము కశ్మీర్లోని బాధితులకు న్యాయం చేసేందుకే తాము చర్చా కార్యక్రమం నిర్వహించామని అమ్నెస్టీ స్ఫష్టం చేసింది.  దీనికి సంబంధించిన వీడియోను అమ్నెస్టీ పోలీసులకు సమర్పించింది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్లు దీనిపై విచారణ చేపడతారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌