ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎయిర్పోర్టులో బుల్లెట్ల కలకలం
Published on Tue, 11/15/2016 - 19:17
దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తన వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగేజిలో అతడు ఈ బుల్లెట్లు తీసుకెళ్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వియన్నా నుంచి గోవా వెళ్లేందుకు ముందుగా ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియన్ పౌరుడిని సాధారణంగా చెక్ చేసినప్పుడు అతడి బ్యాగేజిలో 5.56ఎంఎం లైవ్ బుల్లెట్లు దొరికాయని వివరించారు.
అతడి పేరు డబ్ల్యు జోషెడ్ అని, గోవా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ బుల్లెట్లు తీసుకెళ్లడానికి అతడి వద్ద తగిన పత్రాలు ఏవీ లేవని, అందుకే అదుపులోకి తీసుకుని, ఢిల్లీ పోలీసులకు అప్పగించామని అన్నారు. భారతదేశ చట్టాల ప్రకారం విమానంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకెళ్లడం నేరం.
#
Tags