లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
Breaking News
‘అనంత’లో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం
Published on Tue, 08/18/2015 - 20:49
అనంతపురం ఎడ్యుకేషన్: కడప జిల్లాలో నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని నిరసిస్తూ మంగళవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. మంత్రి నారాయణ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల యాజమాన్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వెఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం రాయలసీమ వ్యాప్తంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్, ఓసీ విద్యార్థి సంఘం బుధవారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఎస్ఎస్యూ ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలో రాస్తారొకో చేశారు. కదిరి పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడ్డారు. ఉరవకొండ పట్టణంలో ఎబీవీపీ అధ్వర్యంలో వుంత్రి నారాయుణ దిష్టిబొవ్మును దహనం చేశారు.
Tags