amp pages | Sakshi

ప్రభుత్వానికి ‘అసహనం’ పరీక్ష

Published on Mon, 11/30/2015 - 04:24

వేడెక్కనున్న శీతాకాల సమావేశాలు
* అసహనంపై నేడు లోక్‌సభలో చర్చ షురూ

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి సోమవారం నుంచి ‘అసహనం’ పరీక్ష ఎదురుకానుంది. దేశంలో పెరుగుతున్న అసహనంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు ప్రతిపక్షాలు రెండు సభల్లోనూ నోటీసులు ఇవ్వడంతో సోమవారం నుంచి ఈ అంశంపై చర్చ మొదలుకానుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరు మంత్రులపై చర్యలు తీసుకోవాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాంగ్రెస్, జేడీయూ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు అసహనంపై చర్చకు ఓటింగ్‌తో లేదా ఓటింగ్ లేకుండా చర్చ, తీర్మానానికి ఉభయ సభల్లోనూ నోటీసులు ఇచ్చాయి. లోక్‌సభలో సోమవారం నుంచి చర్చ ప్రారంభం కానుండగా.. రాజ్యసభలో మాత్రం ఈ వారంలో ఏదో ఒక రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి రెండ్రోజులు రాజ్యాంగంపై చర్చలో అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నా సభకు అంతరాయం కలగలేదు.

అయితే సోమవారం నుంచి అసహనంపై చర్చ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే కీలకమైన బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అసహనం అంశంపైనే ఎక్కువగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.   
 
‘వినియోగదారుల బిల్లు’ మరింత జాప్యం

వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లు-2015 పార్లమెంటుకు రావడం ఆలస్యం కావొచ్చు. ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లును పరిశీలిస్తోంది. దీనిపై కమిటీ నివేదిక ఇవ్వాల్సిన గడువును కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటివారం వరకు  పొడిగించింది. కాగా, లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏడాది చర్చల తర్వాత దానిపై ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. తుది నివేదికను వచ్చే నెల మొదట్లో రాజ్యసభకు సమర్పించనుంది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)