amp pages | Sakshi

డోక్లాం పరిష్కారం: తెర వెనుక ఉన్నదెవరు?

Published on Wed, 08/30/2017 - 11:30

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన నేపథ్యంలో అనూహ్యంగా తెరపడింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వివాదం.. భారత్‌, చైనా, భూటాన్‌ ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం కొండప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి భారత్‌-చైనా అంగీకరించడంతో శాంతియుతంగా పరిష్కారం అయింది. చైనా మీడియా, ఆ దేశ అధికారులు డోక్లాం వివాదంపై రోజుకో రెచ్చగొట్టే వ్యాఖ్య చేసినా.. భారత్‌ మాత్రం పరిణతితో హుందాగా రాజకీయ మౌనాన్ని పాటించింది. అవసరమైనప్పుడు మాత్రమే చైనా వాదనను తిప్పికొట్టింది. మరి, ఈ వివాదం సామసర్యంగా ముగియడంలో తెరవెనుక ఉన్నదెవరు అంటే.. అది జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌. ఆయన బృందమే అని చెప్పాలి.

మొండి వితండవాదం చేస్తున్న చైనాతో ధోవల్‌, ఆయన బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రత్యర్థికి గణనీయమైన నష్టాన్ని చేకూర్చగలమన్న ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఆత్మవిశ్వాసం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో దృఢవైఖరిని అవలంబిస్తూనే.. చైనాతో దౌత్య చర్చలను  దోవల్‌ బృందం తెలివిగా ముందుకు తీసుకెళ్లింది.

గత జూలై 27న బీజింగ్‌లో ధోవల్‌ చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జీచితో తొలిసారి భేటీ అయి దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 'ఇది మీ భూభాగమా?'అని యాంగ్‌ ప్రశ్నించగా.. ఈ ప్రశకు ఏమాత్రం తొణక్కుండా 'ప్రతి వివాదాస్పద ప్రాంతం చైనాకే చెందుతుందా?'అని దోవల్‌ దీటుగా ప్రశ్నించినట్టు సమాచారం. భూటాన్‌ భూభాగంలో రోడ్డు నిర్మించడం ద్వారా మూడు దేశాల ట్రైజంక్షన్‌లో చైనా స్టేటస్‌కో మార్చివేసిందని దోవల్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా చారిత్రక ఒడంబడికలకు అనుగుణంగా భూటాన్‌ భద్రతను కాపాడాల్సిన భారత్‌కు ఉందని గుర్తుచేశారు. అయితే, డోక్లాంకు బదులుగా 500 చదరపు కిలోమీటర్ల భూటాన్‌ భూభాగాన్ని తిరిగి ఇస్తామని చైనా ఆఫర్‌ చేసినా భారత్‌ తిరస్కరించింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జైశంకర్‌, చైనాలోని భారత రాయబారి విజయ్‌ గోఖలే, ఆర్మీ చీఫ్‌ రావత్‌, మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ భట్‌ తదితరులు చైనా బృందంతో చర్చలు జరిపినవారిలో ఉన్నారు.



ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు చైనా అధ్యక్షుడు గ్జి జింపింగ్‌ ఈ దౌత్యచర్చలకు ఆమోదం తెలిపినప్పటికీ.. రాజకీయ మౌనాన్ని పాటించడంతో తెరవెనుక ఏం జరుగుతున్నది పెద్దగా తెలియలేదు. జీ20 సదస్సు సందర్భంగా హంబర్గ్‌లో భేటీ అయిన ఇద్దరు అధినేతలు డోక్లాం వివాదం మరింత ఉద్రిక్తతలు రాజేయకుండా ఉండేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే డోక్లాం వివాదం సత్వరంగా ముగిసేలా చూడాలని ప్రధాని మోదీ దోవల్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఎంతో లబ్ధ పొందుతాయనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో చైనా మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినా.. భారత్‌ మాత్రం సామరస్య పరిష్కారం కోసం ఒకింత మౌనాన్ని పాటించింది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)