కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
Breaking News
ఎయిర్లైన్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లు
Published on Thu, 01/05/2017 - 11:52
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో పెరుగుతున్న రద్దీని ప్రముఖ ఎయిర్ లైన్స్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్ ప్రైస్ వార్ లో మరింతగా దూసుకుపోతున్నాయి. ఈ మేరకు తక్కువ ధరలను ఆఫర్ చేస్తున్నాయి.
జెట్ ఎయిర్ వేస్
'గెట్ సెట్ ఫర్ ప్లయింగ్ స్టార్ట్' పేరుతో తగ్గింపు ధరల పథకాన్ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఈ బుకింగ్స్ కోసం జనవరి 7, 2017 వరకు అవకాశాన్ని కల్పించింది. ఎంపిక చేసిన విమానాల్లో రూ. 999 లకే టికెట్లను అందించనుంది. దేశీయ రూట్లలో అన్ని టాక్స్ లను కలుపుకొని డిస్కౌంట్ రేట్లను అందిస్తోంది.
ఇండిగో
ఎంపిక చేసిన రూట్లలో మరో ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా రూ. 949 లకే విమాన టికెట్లను అందిస్తోంది. ఈ బుకింగ్ ద్వారా జనవరి 31, 2017 నుంచి ఏప్రిల్ 13, 2017 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది. కోయంబత్తూరు -చెన్నైరూ. 949, న్యూఢిల్లీ- జైపూర్ రూ. 1,042, చెన్నై-బెంగళూరు రూ.1,187 , ఢిల్లీ-ముంబై రూ. 2,214, రూ నుంచి ఢిల్లీకి చెన్నై- ఢిల్లీ రూ. 2,832 లకు అందుబాటులో ఉన్నట్టు అధికారిక వెబ్ సైట్లో ఇండిగో పేర్కొంది.
గో ఎయిర్
ఎంపిక చేసిన మార్గాల్లో రూ.1,057 నుంచి ప్రారంభయ్యే టికెట్లను గోఎయిర్ ఆఫర్ చేస్తోంది. జనవరి 31 దాకా బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది. ఈ పథకం క్రింద జైపూర్ - ఢిల్లీ రూ.1,267, బెంగళూరు - గోవా రూ.1,692 ఇతర ధరలను అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.
ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ (సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్) ప్రకారం జనవరి -నవంబర్ 2016 భారత మార్కెట్లో విమాన ప్రయాణికుల సంఖ్య 23 శాతం జంప్ చేసి 903 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయ విమానయానంలో బలమైన పెరుగదలను దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థలు ఈ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వివరాలకోసం ఆయా సంస్థల వెబ్ సైట్లను సందర్శించవచ్చు.
Tags