amp pages | Sakshi

విభజన హామీలను లేవనెత్తుదాం

Published on Tue, 11/15/2016 - 02:35

♦ కొత్త జిల్లాలకు సాయంపైనా అడగాలి
♦ పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం
♦ ముగ్గురు ఎంపీలతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ ఎంపీలతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభలో పార్టీ నేత జితేందర్‌రెడ్డి సోమవారం జరిగే టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కానీ సీఎం వద్ద జరగాల్సిన ఈ సమావేశం రద్దయ్యింది. ఆదివారమే ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌లతో సీఎం సమావేశమయ్యారని తెలిసింది. పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై వీరితో చర్చించారని సమాచారం.


హైకోర్టు విభజన, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాల అమల్లో జరుగుతున్న జాప్యం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను సభలో టీఆర్‌ఎస్‌ లేవనెత్తనుందని సమాచారం. ప్రధానంగా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన వివిధ సౌకర్యాల అంశాన్ని కూడా లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో రాష్ట్రాదాయానికి పడుతున్న గండిపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని కేంద్రం ఎలా భర్తీ చేయనుందో సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వ్యూహాన్ని పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఎంపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)