amp pages | Sakshi

అవి నా ప్రతిష్టకు పరీక్ష: ములాయం

Published on Sun, 01/12/2014 - 03:10

ఝాన్సీ: ప్రధాని పీఠం అధిరోహించాలన్న తన మనోగతాన్ని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మరోసారి బయటపెట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు తన ప్రతిష్టకు సంబంధించినవని, ఈ ఎన్నికల్లో ఎస్పీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టాలని ప్రజలను కోరారు. దేశంలో సమృద్ధిగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా.. నేటికీ ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయని, ఇందుకు యూపీఏ ప్రభుత్వ అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. శనివారమిక్కడ నిర్వహించిన ‘దేశ్ బచావో, దేశ్ బనావో’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అధిక ధరలను అరికట్టలేనివారిని, దేశం నుంచి పేదరికాన్ని పారదోలలేని వారిని అధికారం నుంచి తప్పించాల్సిన సమయం వచ్చింది.
 
 మొదటిసారిగా చెబుతున్నా.. వచ్చే ఎన్నికలు నా ప్రతిష్టకు సంబంధించినవి. దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేందుకు సమాజ్‌వాది పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. రైతులు దేశానికి చాలినంత ఆహార ధాన్యాలను పండిస్తున్నా.. యూపీఏ సర్కారు దేశం నుంచి ఆకలిని పారదోలలేకపోయిందని విమర్శించారు. వ్యవసాయాధారిత దేశంలో ఆకలి చావులు చూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఇంతటి సిగ్గుమాలిన, బలహీనమైన ప్రభుత్వం ఇంతకుముందెప్పుడూ లేద ని మండిపడ్డారు. మైనారిటీలను అనుమానంగా చూడొద్దని, ఈ దేశాభివృద్ధిలో రైతుల పాత్ర ఎంత ఉందో.. ముస్లింల పాత్ర కూడా అంతే ఉందని చెప్పారు. ‘‘మనం ధరించే దుస్తుల్లో 80 శాతం ముస్లింలు తయారు చేస్తున్నవే. దేశ భద్రతకు వినియోగిస్తున్న చాలా ఆయుధాలు కూడా వారు తయారుచేస్తున్నవే’’ అని అన్నారు.

Videos

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?