ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
2014లో కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య 'మహాభారత యుద్ధం'
Published on Sun, 10/27/2013 - 12:00
2014 పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ ల మధ్య జరిగే 'మహాభారత యుద్ధం' అని ఆర్ధిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. రాజకీయాలతో ఆర్ఎస్ఎస్ కు ప్రత్యక్ష సంబంధం లేకున్నా.. పరోక్షంగా బీజేపీని నియంత్రిస్తోందని.. అందుకే ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మహాభారత యుద్దం జరుగబోతుందంటూ చిదంబరం అన్నాడు.
తిరుచురాపల్లిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిదంబరం ప్రసంగించారు. మత ప్రాతిపాదికన ప్రజలను విడదీయడానికి ఆర్ఎస్ఎస్ దుష్ట ప్రయత్నాలను ప్రారంభించిందని చిదంబరం ఆరోపించారు. గుజరాత్ లో ముస్లిం యువకులను ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపారని.. తాను హోంమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్ కౌంటర్లను ఒప్పుకోలేదు అని అన్నాడు.
#
Tags