రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
5 లక్షలు తగ్గనున్న మెర్సిడెస్ బెంజ్ ధర
Published on Tue, 08/27/2013 - 02:12
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, జీఎల్-క్లాస్ ధర రూ. 5 లక్షలు తగ్గనున్నది. ఈ ఎస్యూవీని పుణే సమీపంలోని చకన్ ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం తెలిపింది. ఫలితంగా ఈ కారు ధర రూ. 5 లక్షలు దిగిరానున్నది. అమెరికాలోని టస్కలూసా ప్లాంట్ వెలుపల ఈ జీఎల్-క్లాస్ ఎస్యూవీని అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరను అప్పుడు రూ.77.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎస్యూవీని దేశీయంగా అసెంబుల్ చేస్తుండటంతో దీని ధర రూ. 5 లక్షలు తగ్గి రూ.72.58 లక్షల(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ)కు చేరింది.
#
Tags