నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఘటన అవమానకరం.. సీఎం సీరియస్
Published on Thu, 03/09/2017 - 15:21
తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం నాడు కొచ్చి బీచ్ లో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనను ఆయన ఖండించారు. ఇది అవమానకర ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
కొచ్చి బీచ్ లో బుధవారం పలు యువ జంటలపై శివసేన కార్యకర్తలు దాడులు చేశారు. పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరిమికొట్టారు. ఈ ఘటనపై ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక వార్త ఇక్కడ చదవండి:
‘ఉమెన్స్ డే’ జంటలను పరుగెత్తించి కొట్టారు
#
Tags