ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆల్ టైమ్ గరిష్టంలో నిఫ్టీ
Published on Thu, 03/16/2017 - 09:53
ముంబై: ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ భేటికి ముందు గురువారం ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు ఆల్ టైమ్ గరిష్టంలో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 168.71 పాయింట్ల లాభంలో 29,566 వద్ద, నిఫ్టీ 54.55 పాయింట్ల లాభంలో 9,139 వద్ద ట్రేడవుతున్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఫెడరల్ రిజర్వు పావు శాతం వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఆసియన్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో దేశీయ మార్కెట్లు పాజిటివ్ గానే ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1-3 శాతం లాభపడగా.. హీరో మోటారో కార్పొ అరశాతం మేర పడిపోతుంది.
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ మరింత బలపడుతోంది. నిన్నటి ముగింపుకు 29 పైసలు లాభపడి 65.40 వద్ద ఎంట్రీ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు జోషిచ్చాయని విశ్లేషకులు చెప్పారు. రూపాయి సైతం పాజిటివ్ గా ట్రేడవుతుందన్నారు. అంచనాలకు అనుగుణంగా నిర్ణయం రావడంతో ఫెడరల్ రిజర్వు రేట్ల ప్రభావం ఇటు దేశీయ మార్కెట్లపైనా, అటు ఆసియన్ మార్కెట్లపైనా అంతగా ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.
#
Tags