ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
‘బాలసూర్య, బాలరత్న’లకు అర్హులు వీరే !
Published on Wed, 11/06/2013 - 02:27
హైదరాబాద్, న్యూస్లైన్: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టిన రోజు(నవంబర్ 14)ను పురస్కరించుకుని జవహర్ బాలభవన్ ఏటా ప్రకటించే బాలసూర్య, బాలరత్న అవార్డుల ఎంపిక ముగిసినట్టు బాలభవన్ సంచాలకురాలు పి.సంధ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి ఈ నెల 14న బాలల దినోత్సవంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి అవార్డులు అందించనున్నట్టు పేర్కొన్నారు. అవార్డులకు ఎంపికైన వారు.. అగ్ని భువ(జోన్ 1) విశాఖపట్నం, (సృజనాత్మక కళ), వి.మేఘన(జోన్ 4) తిరుపతి (సృజనాత్మక రచన), కె.హరిప్రియారెడ్డి(జోన్ 5) వరంగల్ (సృజనాత్మక నృత్యం), శ్రీహర్షిత(జోన్ 6) సికింద్రాబాద్ , శశాంక్(జోన్ 2) విజయవాడ (సృజనాత్మక సంగీతం), సయ్యద్ టాజిద్ రెహ్మాన్(జోన్ 1) విశాఖపట్నం (సైంటిఫిక్ ఇన్నోవేషన్), శాంతి(జోన్ 6) సికింద్రాబాద్, డి.సిద్దార్థరెడ్డి(జోన్ 3) నెల్లూరు (స్పెషల్ క్రియేటివ్ ఆర్ట్).
Tags