అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సేవల రంగం నుంచే కొత్త కంపెనీల జోరు
Published on Mon, 12/23/2013 - 01:36
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అక్టోబరులో 6,586 కంపెనీలు కొత్తగా నమోదయ్యాయి. ఇందులో 70 శాతం కంపెనీలు సేవల రంగం నుంచి రావడం విశేషం. రంగాల వారీగా చూస్తే పరిశ్రమలు, వ్యవసాయం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వీటన్నిటి అధీకృత మూలధనం రూ.2,833.87 కోట్లని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం. అక్టోబరులో 20 విదేశీ కంపెనీలు భారత్కు వచ్చిచేరాయి. వీటిలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ఒక్కొక్కటి ఆరు కంపెనీలను ఆకర్శించాయి. మొత్తంగా మహారాష్ట్రలో 1,304, ఢిల్లీలో 1,149, ఉత్తర ప్రదేశ్లో 536 కంపెనీలు కొత్తగా అడుగుపెట్టాయి. అక్టోబరు చివరినాటికి దేశంలో నమోదిత కంపెనీల సంఖ్య 13.5 లక్షలు. 9.12 లక్షల కంపెనీలు చురుకుగా ఉన్నాయి. 2.65 లక్షల కంపెనీలు మూతపడ్డాయి.
#
Tags