అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ప్రజల రాష్ట్రపతి.. అబ్దుల్ కలాం'
Published on Mon, 07/27/2015 - 23:00
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(84) ఆకస్మిక మృతి దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి అబ్దుల్ కలాం అనితర సేవలు అందించారని ప్రణబ్ తెలిపారు. అటు శాస్త్రవేత్తగా, ఇటు పరిపాలకుడిగా కలాం దేశానికి మహోన్నతమైన సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాం అప్పుడూ-ఎప్పుడూ ప్రజల రాష్ట్రపతిగానే నిలిచిపోతారని ప్రణబ్ తన గౌరవ సంతాపంలో పేర్కొన్నారు.
అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో జరిగే సెమినార్లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే వేదికపై తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆయనను అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలోని బెథనీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
#
Tags