amp pages | Sakshi

దారుణం: ముస్లిం గర్భిణీ సజీవ దహనం!

Published on Tue, 06/06/2017 - 11:42

బెంగళూరు: కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో గర్భిణీ అయిన ఓ ముస్లిం మహిళను ఆమె కుటుంబసభ్యులే సజీవంగా దహనం చేశారు. ఈ అమానుష ఘటన బీజాపూర్‌ జిల్లాలోని గుండనకల గ్రామంలో జరిగింది. గుండనకలకు చెందిన బానూ బేగం (21) తన ఊరికి చెందిన దళిత యువకుడైన సాయబన్న శరణప్ప కొన్నూర్‌ (24)ను ప్రేమించింది. కొంతకాలంగా వీరి ప్రేమ గురించి గత జనవరిలో ఇద్దరి కుటుంబాలకు తెలిసింది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు.
 
వీరి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బాను కుటుంబం ఆమెను పోలీసు స్టేషన్‌కు ఈడ్చుకొచ్చి సాయబన్నకు వ్యతిరేకంగా పోస్కో కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. అయితే, సాయబన్నపై ఎలాంటి క్రిమినల్‌ అభియోగాలు, చరిత్ర లేకపోవడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. అనంతరం సాయబన్న  బానును తీసుకొని ఇంటినుంచి పారిపోయాడు. ఇద్దరూ కలిసి గోవా వెళ్లారు. ఆ తర్వాత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకొని కర్ణాటకలోనే కొంతకాలం నివసించారు. ఈ క్రమంలో బాను గర్భవతి కావడంతో ఇరు కుటుంబాలు మారి ఉండవచ్చునన్న ఆశతో గత శనివారం (జూన్‌3న) ఊరికి తిరిగొచ్చారు.

అయితే, తమ వైఖరిని ఏమాత్రం మార్చుకొని ఇరుకుటుంబాలు సాయబన్న-బాను దంపతులను చూడటంతోనే గొడవకు దిగారు. బాను కుటుంబం బరితెగించి సాయబన్నపై దాడికి దిగింది. అతన్ని రాళ్లతో కొట్టి తరిమింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుతున్న సాయబన్న స్థానికంగా ఉన్న తాలికోట్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. మరో పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే బానును ఆమె కుటుంబసభ్యులే కత్తితో పలుమార్లు పొడిచి.. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. పట్టపగలే ఈ కిరాతకం జరుగుతున్నా, తన భార్యను కాపాడాలని సాయబన్న వేడుకున్నా గ్రామస్తులు ఎవరూ ముందుకురాలేదని, తమ ఇళ్లకు తలుపులు పెట్టుకొని లోపలే ఉండిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో బాను తల్లిని, సోదరిని, సోదరుడిని, బాను అరెస్టు చేశారు. బాను మరో ఇద్దరు అక్కల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)