రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కువైట్లో రాజంపేట వాసి మృతి
Published on Wed, 08/12/2015 - 18:33
రాజంపేట(వైఎస్సార్జిల్లా): పొట్టకూటికోసం కడుపు చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వలస కూలి అక్కడ పనిచేస్తూ.. ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పి. వెంకటేశ్వర్లు(40) రెండు నెలల కిందటే బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లాడు.
కువైట్లోని తెరాక్ ప్రాంతంలో భవన నిర్మాణ కూలిగా పనికి కుదిరాడు. ఈ క్రమంలో తెరాక్లో నిర్మాణంలో ఉన్న భవనానికి అద్దాలు బిగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
#
Tags