amp pages | Sakshi

సంచలనం రేపుతోన్న విందు భేటీ

Published on Fri, 06/16/2017 - 18:03

- రాష్ట్రపతి భవన్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌
- ప్రణబ్‌తో కలిసి లంచ్‌చేసిన భగవత్‌
- అనూహ్య పరిణామాంపై సర్వత్రా విస్మయం


న్యూఢిల్లీ:
రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలైన నాటి నుంచి ఎవరిపేరైతే ఎన్డీఏ అభ్యర్థిగా బలంగా వినిపిస్తోందో.. ఆ మోహన్‌ భగవత్‌ రాష్ట్రపతి భవన్‌కు రావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆహ్వానం మేరకే మోహన్‌ భగవత్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్‌, భగవత్‌లు కలిసి మధ్యాహ్న భోజనం(లంచ్‌) చేశారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కరసేవకులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం రుద్రపూర్‌(ఉత్తరాఖండ్‌)లో ఉన్న మోహన్‌ భగవత్‌కు గురువారమే రాష్ట్రపతి భవన్‌ నుంచి పిలుపు అందినట్లు తెలిసింది. ఈ మేరకు రుద్రపూర్‌నుంచి ఢిల్లీకి వచ్చిన భగవత్‌ నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రణబ్‌ను కలుసుకున్నారు.

దీనర్థం ఏమిటి?
రాష్ట్రపతి రేసులో మోహన్‌ భగవత్‌ పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఆయన రాష్ట్రపతితో భేటీ కావడం వెనకున్న అర్థమేమిటనే చర్చ మొదలైంది. మత సంస్థకు అధినేతగానేకాక వివాదాస్పదుడిగానూ పేరుపొందిన మోహన్‌ భగవత్‌ అభ్యర్థిత్వాన్ని విపక్షాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ‘మోహన్‌ భగవతే గనుక రాష్ట్రపతి అభ్యర్థయితే తల తెగిపడినా మద్దతివ్వం’  అని లాలూ ప్రసాద్‌ సహా కొన్ని పార్టీల కీలక నేతలు ప్రకటనలు చేశారు. దీంతో బీజేపీ ‘పైనుంచి నరుక్కు రావాల’ని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రపతితో విందు ద్వారా.. అభ్యర్తి ఎవరనేది చెప్పకనే చెప్పినట్లు కొందరు భావిస్తున్నారు. అయితే ఈ ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందో జులై 17 ఎన్నికల తర్వాతే తేలనుంది.
(రాష్ట్రపతి ఎన్నికలు; బీజేపీకి ఝలక్‌)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)