నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భిక్షాటన మొత్తం 10 లక్షలు కాలిపోయాయి
Published on Fri, 01/15/2016 - 01:20
సాక్షి, ముంబై: పాపం.. ఏళ్ల తరబడి భిక్షాటన చేసి సంపాదించుకున్న డబ్బు ఎలుక పుణ్యమాని తగులబడిపోయింది. అదేం చిన్నా చితకా కాదు.. ఏకంగా రూ. 10 లక్షలు. కళ్యాణ్లోని మారూమూల ప్రాంతంలోని చిన్న గుడిసెలో నివాసముంటున్న మహ్మద్ రెహమాన్, అతని భార్య ఫాతిమా.. సమీపంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో భిక్షాటన చేస్తూ.. ఇంత మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం కరెంటుపోవటంతో.. దీపం పెట్టుకుని పడుకున్నారు.
అయితే.. బుధవారం తెల్లవారుజామున ఎలుకలు దీపాన్ని పడగొట్టడంతో.. గుడిసెకు నిప్పంటుకుంది. ఈ దంపతులు ప్రాణాలతో బయటపడ్డా.. సంచుల్లో దాచి గోడల్లో కుక్కి పెట్టిన సంపాదన కూడా కాలిపోయింది. సంచుల్లో ఉన్న నోట్లను బట్టి రూ.10 లక్షల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
#
Tags