నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విమానంలో శాంసంగ్ టాబ్లెట్ పొగలు
Published on Tue, 09/27/2016 - 17:35
ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనతో తీవ్ర సతమతమైన శాంసంగ్కు మరో చిక్కు వచ్చి పడింది. మరోసారి మరో విమానంలో ఈ ఫోన్ పేలిందని తెలిసింది. ఆ పేలుడు ఘటనతో డెట్రాయిట్ నుంచి అమ్స్టెర్డామ్ వెళ్లే డెల్టా విమానాన్ని శనివారం ఇంగ్లాండ్లోని మాంచెస్టర్కు మళ్లించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మాంచెస్టర్కు వెళ్తున్న ఈ విమానంలో శాంసంగ్ పాబ్లెట్ సీటు లోపలికి పడిపోయి, దానిలో ఇరుక్కు పోయింది. అనంతరం ఆ టాబ్లెట్ పేలి సీటు కవర్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది.
ఆ వింత వాసన, పొగలను గమనించిన ప్రయాణికులు డెల్టా అధికారులకు వెంటనే సమాచారాన్ని అందజేశారు. దీంతో ఆ విమానాన్ని మాంచెస్టర్కు మరలించారు. శాంసంగ్ టాబ్లెట్ వల్ల పాడైపోయిన సీటును కొత్త దానితో పునరుద్ధరించారు. రెండు గంటల అనంతరం మళ్లీ డెల్టా విమానం అమ్స్టెర్డామ్కు పయనమైంది.
అయితే ఈ ఘటనను శాంసంగ్ ఖండిస్తోంది. బహిరంగ కారణాలే ఈ ఘటనకు దోహదం చేసి ఉంటాయని, గెలాక్సీ నోట్7 వల్ల ఈ పొగలు వ్యాపించలేదని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. సమస్యాత్మకమైన బ్యాటరీగల ఫోన్లను తాము రీకాల్ చేస్తున్నామని, ఈ ఘటన శాంసంగ్ ఫోన్ వల్ల కాకపోవచ్చని స్పష్టంచేస్తోంది.డెల్టా అధికారులను తాము ఆశ్రయిస్తామని, దీనిపై విచారిస్తామని పేర్కొంటోంది. మరోవైపు ఈ ఘటనను ఎఫ్ఏఏ సమీక్షిస్తోంది.
#
Tags