amp pages | Sakshi

త్వరలో దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలు

Published on Thu, 10/08/2015 - 00:51

సాధ్యాసాధ్యాలపై కమిటీ
ఎఫ్‌డీఐ వాటా పెంచుకోవడానికి ముందుకొచ్చిన ఏడు కంపెనీలు
చౌకగా పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలి
ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి ఏటా పాలసీని రెన్యువల్ చేయించుకోనవసరం లేకుండా బహుళ సంవత్సరాలు అమల్లో ఉండే ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఐఆర్‌డీఏ ఉంది. అన్ని వైపుల నుంచి దీర్ఘకాలిక ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ రావడంతో దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏ) చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విజయన్ కలసిన విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక పాలసీలకు డిమాండ్ బాగుండటంతో కార్లు, ఆరోగ్య బీమా పాలసీల్లో కూడా దీన్ని అమలు చేయాలని కంపెనీలు కోరుతున్నాయన్నారు. తక్కువ కాలంలోనే దీర్ఘకాలిక ద్విచక్ర వాహన పాలసీల అమ్మకాలు లక్ష మార్కును అందుకోవడంపై విజయన్ సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీలు డిజిటలైజేషన్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను తగ్గించుకొని తక్కువ ప్రీమియంకే పాలసీలను అందించడంపై కంపెనీలు దృష్టిపెట్టాలన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 80 శాతం ఆస్తులకు బీమా రక్షణ ఉందని, కానీ ఇండియాలో ఇది కేవలం 7 శాతంగా ఉందన్నారు. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పెంపు అనుమతి కోరుతూ కంపెనీల నుంచి అధికారికంగా ఎటువంటి దరఖాస్తులు అందలేదని, కానీ ఆరు నుంచి ఏడు కంపెనీలు ఎఫ్‌డీఐ వాటాను పెంచుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పరిశ్రమకంటే బెటర్
ఈ ఏడాది పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించగలమన్న ధీమాను సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ వ్యక్తం చేసింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో సాధారణ బీమా రంగంలో 10 నుంచి 11 శాతం వృద్ధి నమోదైతే, ఇదే సమయంలో తాము 18 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 7,000 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)