ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీ అగ్రనేతపై పోలీసు అధికారి దావా
Published on Sun, 02/19/2017 - 14:53
కోల్ కతా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియాపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు పరువు నష్టం దావా వేశారు. తనపై కైలాశ్ నిరాధార, అసత్య ఆరోపణలు చేశారనే కారణంతో కోల్ కతా నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకు రాజీవ్ కుమార్ ప్రయత్నించారని జనవరి 4న కైలాశ్ ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలక పత్రాలను కమిషనర్ నాశనం చేశారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కోల్కతా నగర సెషన్స్ కోర్టులో కైలాశ్ పై రాజీవ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ సుభ్ర ఘోష్.. మార్చి 7న తమ ఎదుట హాజరు కావాలని కైలాశ్ విజయ్ వార్గియాను ఆదేశించారు.
#
Tags