amp pages | Sakshi

అధిష్టానంతో నేరుగా చర్చించి.. పార్టీని కాపాడుకొందాం! : సీమాంధ్ర మంత్రులు

Published on Wed, 10/02/2013 - 02:07

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సమైక్య ఉద్యమంలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి నష్టం తప్పదు. రాజకీయంగా మనమూ కష్టాలపాలవుతాం. ఈ దశ…లో పార్టీని రక్షించుకొనేందుకు మనమే ప్రయత్నిద్దాం అధిష్టానంతో నేరుగా సంబంధాలు నెరుపుతూ విభజన సమస్యలకు పరిష్కారం చూపిద్దాం. సీమాంధ్రలో పార్టీకి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ కాంగ్రెస్‌ పేరిట ప్రజల్లోకి వెళ్దాం. ఇందుకోసం ముందుగా, ఉద్యమం కొంతైనా చల్లబడాలి. కేంద్ర మంత్రుల బృందాన్ని రప్పించి కొన్ని భరోసాలు ఇప్పిస్తే ఉద్యమాన్ని కొంత చల్లార్చవచ్చు. కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఈ బాధ్యత తీసుకోవాలి.’’
 
ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో మంగళవారం భేటీ అరుున… పలువ…ురు సీమాంధ్ర మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సవ…ూవేశానికి కేంద్రమంత్రి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వ…ుంత్రి ఆనం మంత్రులందరికీ స్వయంగా ఫోన్‌చేసి భేటీకి పిలిచారని సమాచారం. సీమాంధ్ర సమస్యలపై కేంద్రంతో చర్చించే బాధ్యతను చిరంజీవికి అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్‌, సీ రామచంద్రయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, మహీధర్‌ రెడ్డి, బాలరాజు, కొండ్రు మురళీ మోహన్‌ హాజరయ్యారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయంతో ఉద్యమం తీవ్రతరమై ఇబ్బందులు ఎదురవుతున్నా పార్టీ లైన్లోనే వెళ్లాలని ఇటీవలి నిర్ణయానికి అనుగుణంగానే వారు చర్చలు కొనసాగించారు.

 ‘‘ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే సమైక్య ఉద్యమాన్ని భుజాలకెత్తుకోవడంతో పరిస్థితి ఆ పార్టీ వైపే ఏకపక్షమయ్యేలా కనిపిస్తోంది. సమస్యలను కేంద్రంతో పరిష్కరింప చేసి కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం కలిగించే బాధ్యత తీసుకోవలసిన ముఖ్యమంత్రి, ఏకపక్షంగా వెళ్లుతున్నారు. ఈ పరిస్థితిలో అధిష్టానంతో మంతనాలు సాగించి, సమస్యలు పరిష్కరింపచేశామని చెప్పుకొని …మే ప్రజల్లోకి వెళ్దాం’’ అని మంత్రి ఒకరు ప్రతిపాదించారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి రప్పించాలన్ని సూచన కూడా వచ్చింది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రివ…ర్గ సమావేశంలో ప్రధాని దృష్టికి తేవాలని కేంద్రమంత్రి చిరంజీవిని కోరారు. అలాగే పార్టీ అధినేత్రికి కూడా పరిస్థితిని విన్నవించాలని నిర్ణయించారు, ఇక పార్టీలోని ఇతర పెద్దలతో చర్చించే బాధ్యతను బొత్స సత్యనారాయణకు అప్పగించారు. అలాగే మంత్రివర్గ ఉపసంఘంతో ఇకపై చర్చించబోవమంటూ ఏపీఎన్జీఓలు, ఉద్యోగ సంఘాలు ప్రకటించినందున, వారితో మాట్లాడి సమ్మెను విరమింపచేయాల్సిన బాధ్యతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికే వదిలేయాలని మంత్రులు భావిస్తున్నారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)