amp pages | Sakshi

బంగారు తెలంగాణ అంటే విమానాశ్రయాలేనా?

Published on Sat, 02/18/2017 - 23:58

సందర్భం
కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేయాలని అనేక సంవత్సరా లుగా వేరు వేరు రూపాలలో పాలకులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పాలకులు నడుంకట్టారు. టీఆర్‌ఎస్‌ అధి కారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల భూములు గుంజుకుని నిర్వాసితులను చేయడానికి  వెనకడుగు వేయని విషయాలలో  ‘కొత్తగూడెం ఎయి ర్‌పోర్టు’ ఒకటి.

ఈ ఎయిర్‌పోర్టును కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతి పరిధిలో ఉన్న 1,600 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు.. దీని పరిధి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బంగారు చేలుక, పును మడు చేలుక, తోకబండల, మర్రిగూడెం, గోల్లగూడెం, ఎర్రం చెలక, పాయవాల గుంపు మెుదలగు గ్రామాల ప్రజలు భూనిర్వా సితులు కానున్నారు.

ఈ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన ఉన్న ప్రాంతమంతా 5వ షెడ్యూల్‌ పరిధిలోనిదే. ఆదివాసీలు జనాభా 90 శాతం నివసి స్తున్నారు. 5వ షెడ్యూల్డు ప్రాంతం అయినప్పటికీ ఆదివాసీలకున్న రాజ్యాంగ రక్షణలను ఏ మాత్రం పట్టించుకోకుండా 1/70, పెసాలాంటి చట్టాలను అమలు చేయకుండా ప్రజలనూ బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనవి. ఎయిర్‌ ఇండియా అథా రిటి ఇప్పటికే అనుమతినిచ్చింది. భారీ ఎత్తున పోలీసుల మెుహ రింపు చేసి, రెయిడ్స్‌ బృందంవారు గ్రామాలలో సర్వే నిర్వహిం చారు. ప్రజలందరూ ఒకే మాటతో మాకొద్దు ఈ ఎయిర్‌పోర్టు అని వ్యతిరేకిస్తున్నప్పటికీ వారిపై అణచివేతను ప్రయోగిస్తూ వారి భూములు లాక్కొనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.

ప్రజలు విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ అభివృద్ధి ముసుగులో ఏజెన్సీలోనీ సహజ సంపదను బహుళజాతి సంస్థ లకు కట్టబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నంగా విమానాశ్రయం ముందుకువచ్చింది. హక్కుల కోసం ఉద్యమిస్తున్న ప్రజలను అణచివేసేందుకు సైనిక స్థావరాలను అనుసంధానం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందనేది మరో రహస్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. ఇది సైనిక స్థావరం కాదని ప్రజల సౌకర్యం కోసమేనని ప్రభుత్వం చెపుతూ వస్తోంది.

కానీ దీని నిర్మాణం వెనుక ప్రకటిత లక్ష్యాలు ఏమిటి, అసలు లక్ష్యాలు ఏమిటి? అక్కడ విమానాశ్రయాన్ని నిర్మాణం చేయడానికి కానున్న వ్యయం ఎంత? దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఇప్పటి వరకు ప్రజలు విమానాశ్రయం కావాలని పాలకులకు నివేదించారా? ఏ హక్కుతో ఆదివాసీ ప్రజలను చట్ట విరుద్ధంగా బయటకు పంపాలని భావిస్తున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు లేదు. పాలకుల తప్పుడు విధానాలను విమర్శించి ప్రజలను మేల్కొలిపితే వారిని అభివృద్ధి నిరోధకులు అనడం మామూలై పోయింది. విధ్వంసాన్ని ఆపమంటే అన్నింటికీ ఒకేS జవాబు. బంగారు తెలంగాణకు ఆటంకంగా ఉన్నారనో లేదా భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారని అనటం పాలకులకు ఒక సాధారణ పద్ధతిగా అలవాటైంది. ఇంతకు ఏది అభివృద్ధి?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకునే పాలకులు ఏనాడైనా అట్టడుగు ఆదివాసీ, దళిత పీడిత ప్రజల బాగోగులు చూశారా? విమానాలలో తిర గండి. ఇదిగో అభివృద్ధి వెలిగిపోతుందనే వారు కొత్తగూడెం జిల్లా ఆదివాసుల, ఇతర దళిత పేద వర్గాలకు విద్యా, వైద్యం, రవాణా లాంటి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదు. కానీ ఆదివాసీ ప్రజలను విమానం ఎక్కిస్తామని మన పాలకులంటున్నారు. దీనిని గట్టిగా విమర్శించలేని ప్రతిపక్ష పార్టీలు పైకో మాట లోపల మరో మాటతో కాలం వెళ్లదీస్తున్నారు. సరైన నష్ట పరిహారం, స్థల మార్పిడి లాంటి పనికిరాని అర్థంలేని ప్రతిపాదనలు పెడుతు న్నారు. పాలకులు నిర్దయగా అమలుచేసే సామ్రాజ్యవాద ‘అభి వృద్ధి’ని విధ్వంసంగా చెప్పే స్పష్టమైన రాజకీయ అవగాహన లేని విధానాలు అవలంభించే పార్టీల వల్ల ప్రజల పోరాటాలకు తగిన ఫలితం దక్కకుండా పోవడం కనిపిస్తూనే ఉంది.

మ«ధ్యతరగతి బుద్ధిజీవులలో కూడా కొందరు విమానాశ్ర యాన్ని కడితే ప్రయోజనమే కదా... అని అంటున్నారు. ఇది రాజ కీయ పార్టీలకు బలాన్ని ఇచ్చేవాదనే. నిజానికి దోపిడి వర్గ రాజ కీయ పార్టీల బలమంతా దానిలోనే ఉన్నది. వాస్తవంగా ఆ ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏమిటంటే విమానాశ్రయం పేరుతో నిర్మించేది సైనిక స్థావరం అయినప్పుడు దానిని కావాలని కోరు కోవడం వల్ల అంతిమంగా లాభం పొందేదెవరు? ఒకవేళ దానిలో కొంత భాగం పౌర విమానయానికి కేటాయించినప్పటికీ ఆ విమా నాలలో తిరిగే వారెవరు? ఇప్పటికీ గ్రామాలకు ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని మైలారం గ్రామ పంచాయతిలోని ఏడు గ్రామాల ఆది వాసీ ప్రజలా? మూడు పూటలా తిండి కూడా దొరకని, వైద్యంలేక చచ్చే పేదలా? కొత్తగూడెం జిల్లాలోని ఆర్థిక సామాజిక స్థితి అధ్య యనం చేశారా?

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్‌డీవో, డీఎఫ్‌ఓ మెుదలగు జిల్లా ప్రధాన కార్యాలయాలకు పావు కిలోమీటరు దూరం కూడా ఉండదు. ఆ జిల్లా బస్టాండులో కనీసం తాగడానికి నీరే కాదు.. మూత్రశాలలు కంపు వాసనతో రోత పుట్టిస్తాయి. ఇటువంటి చోట కాసిన్ని నీళ్ళూ, నాలుగు ఫినాయిల్‌ బాటిళ్ళూ సప్లై చేయలేని అసమర్థ పాలకులు బంగారు తెలం గాణలో విమానాలు మీ కోసమేనని ప్రజలకు ఊదరగొడితే నమ్మే దెవరని స్థానిక ప్రజలు అడుగుతున్నారు. (ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడేదెవరో స్పష్టంగా చెప్పాలంటే... జలగం వెంగళ రావు కుమారుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు). మన పాలకులు నిత్యం రాజ్యాంగాన్ని చట్టాలను వందల వేల లక్షలసార్లు ఉల్లంఘిస్తారు. కానీ పేదలు కడుపు మండి చావ లేక బతకడానికి ప్రతిఘటిస్తే మాత్రం చట్టాలు ప్రజలకు వ్యతి రేకంగా అమలవుతాయి. శాంతి భద్రతలు గుర్తుకొస్తాయి. లాఠీలు లేస్తాయి. తుపాకులు గర్జిస్తాయి.

ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ శ్రేణులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ప్రభుత్వ కుట్రలను అభి వృద్ధి పేరుతో కొనసాగుతున్న విధ్వంసాన్ని ప్రతిఘటించాలని కోరుతున్నాము. ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న విమానాశ్రయాన్ని/సైనిక స్థావరాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆదివాసీ ప్రజల నుంచి నిర్బంధంగా భూములు ఆక్రమించుకోవడాన్ని ఆపివేయాలి. ఆదివాసీ చట్టా లను, రాజ్యాంగ రక్షణలను అమలు చేయాలని ప్రతి తెలంగాణ వాదీ, రాజకీయ పార్టీలూ నినదించాలనీ మనవి చేస్తున్నాము.
(కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు ఉదయం 10 గంటలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం సందర్భంగా...)


- నలమాస క్రిష్ణ

వ్యాసకర్త తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్‌ : 98499 96300

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)