వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు..
Published on Sun, 01/03/2021 - 18:23
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా, 232 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,3082కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. (చదవండి: కరోనా టీకా: డీసీజీఐ కీలక ప్రకటన)
కోవిడ్ బారినపడి గడచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మృతిచెందగా, ఇప్పటివరకు 7115 మంది మరణించారు. గత 24 గంటల్లో 352 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,72,897 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,19,72,780 శాంపిల్స్ను పరీక్షించారు.(చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత?)
Tags