amp pages | Sakshi

హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

Published on Tue, 12/07/2021 - 03:55

సాక్షి అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ డాక్టర్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ వారంలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది.

న్యాయమూర్తుల నేపథ్యం ఇది..
న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మధరావు
జననం: 1966, జూన్‌ 30
ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ
విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డాక్టరేట్‌

ప్రస్థానం: 
► 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 
► 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. 
► ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వంటి కీలక సంస్థలకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 
► పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు.

న్యాయమూర్తి జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి
స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు
విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు.

ప్రస్థానం: 
► న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. 
► 2020 జూన్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు. తొలి మహిళా రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి కావడం విశేషం. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)